మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కి చేరుకున్నారు. నిన్న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరారు. ఈట‌లతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డి,మాజీ జెడ్పీ ఛైర్మ‌న్ తుల ఉమా,మాజీ ఎంపీ ర‌మేష్ రాథోడ్‌తో పాటు త‌దిత‌రులు బీజేపీలో చేరారు. వీరంతా తిరిగి హైద‌రాబాద్‌కి చేరుకోగా...బీజేపీ కార్య‌క‌ర్త‌లు,అభిమానులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.ఎయిర్‌పోర్టు నుంచి బ‌య‌టికి వ‌చ్చిన ఈట‌ల రాజేంద‌ర్‌ను ఆయ‌న కుమారుడు, కోడ‌లు రిసీవ్ చేసుకున్నారు.మొత్తానికి ఈట‌ల రాజేంద‌ర్ చేరిక‌తో బీజేపీకి మ‌రింత బ‌లం చేకూరిందని సీనియ‌ర్ నేత‌లు అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: