టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు. విశాఖ‌లో టీడీపీ బీసీ నేత‌ల‌పై సాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్‌లు క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.ప‌ల్లా శ్రీనివాస్‌ని విజ‌యసాయిరెడ్డి అల్లుడు వైసీపీలో చేర‌మ‌ని అడిగితే ప‌ల్లా నిరాక‌రించార‌ని తెలిపారు.విశాఖ‌లో వైసీపీ ప‌ట్టులేక‌నే టీడీపీ నేత‌ల్ని బెదిరిస్తున్నార‌ని బుద్దా ఆరోపించారు.రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ముగిసిన వెంట‌నే విజ‌య‌సాయిరెడ్డి విశాఖ ఎంపీగా పోటీ చేసి ప్ర‌జ‌ల్లో త‌న‌కున్న ఆద‌ర‌ణ‌ను రుజువు చేసుకోవాల‌ని స‌వాల్ విసిరారు.దొంగ‌లు,దోపిడీదారులు,క‌బ్జాకోరులు వైసీపీలో ఉంటే...టీడీపీ వారిని క‌బ్జాకోరులు అన‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.బ‌య‌టి నుంచి వ‌చ్చిన విజ‌య‌సాయిరెడ్డి,అవంతిశ్రీనివాస్‌లు విశాఖ‌వాసుల‌ను అమాయ‌కుల్ని చేసి చెడుగుడు ఆడుతున్నార‌ని బుద్దా వెంక‌న్న తెలిపారు. ప‌ల్లా శ్రీనివాస్ నిజంగా భూములు ఆక్ర‌మించుకుంటే ఆయ‌న వ‌ద్ద ఉన్న ఆధారాలు ప‌రిశీలించి చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు.2024లో టీడీపీ అధికారం వ‌చ్చిన వెంట‌నే విజ‌య‌సాయిరెడ్డి నేతృత్వంలో జ‌రిగిన క‌బ్జాల భ‌ర‌తంప‌డ‌తామ‌ని బుద్దా వెంక‌న్న హెచ్చ‌రించారు.విజ‌య‌సాయి,అవంతి శ్రీనివాస్‌ల‌తో స‌హా ప్ర‌తి ఒక్క‌రికి వ‌డ్డీతో స‌హా చెల్లిస్తామ‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: