వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు  సొంత పార్టీలో హీట్‌పుట్టిస్తున్నారు.రోజుకో స‌మ‌స్య‌పై సీఎంకు లేఖ‌లు ర‌ఘురామ‌రాజు లేఖ‌లు రాస్తున్నారు.ఇదిఇలా ఉంటే ర‌ఘురామ‌రాజుపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని వైసీపీ చీఫ్ విప్ మార్గాని భ‌ర‌త్ రెండురోజుల క్రితం లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు.దీనిపై ఈ రోజు భ‌ర‌త్ స్పందించారు.పార్టీ వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్న ర‌ఘురామ‌రాజుపై అనర్హ‌త వేటు ప‌డ‌టం ఖాయ‌మంటూ ఆయ‌న తెలిపారు. అన‌ర్హ‌త‌పై లోక్‌స‌భా స్పీక‌ర్‌కు రిమైండ‌ర్ నోటీస్ ఇచ్చిన‌ట్లు భ‌ర‌త్ తెలిపారు.ర‌ఘురామ‌కృష్ణం రాజుకు పౌరుషం ఉంటే ఈట‌ల రాజేంద‌ర్ లాగా రాజీనామా చేయాల‌న్నారు.అయితే మ‌రోవైపు ర‌ఘురామ‌రాజుని పార్టీ నుంచి స‌స్పెండ్ ఎందుకు చేయ‌డంలేదంటూ ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి. స‌స్పెండ్ చేసే ధైర్యంలేక పార్టీ వెబ్‌సైట్ నుంచి తొలిగించారంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: