సుధీర్ఘ‌పాత్ర యాత్ర‌లో ఇచ్చిన హామీలు సీఎం జ‌గ‌న్ అమ‌లు చేస్తున్నారు. ప్ర‌తి ఏటా అనుకున్న స‌మ‌యానికి సంక్షేమ‌ప‌థ‌కాల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ల‌బ్దిదారుల‌కు అందిస్తున్నారు. ఈ ఏడాది వైఎస్ఆర్ వాహ‌న‌మిత్ర ప‌థ‌కం కింద ల‌బ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా ప్ర‌భుత్వం డ‌బ్బుల‌ను జ‌మ చేసింది.క్యాంప్ కార్యాల‌యంలో సీఎం జ‌గ‌న్ ఆటో,క్యాబ్ డ్రైవ‌ర్ల స‌మ‌క్షంలో కంప్యూట‌ర్ బ‌ట‌న్ నొక్కి సుమారు 2.48 ల‌క్ష‌ల మంది ల‌బ్దిదారుల‌కు 248.47 కోట్లు జ‌మ చేశారు.ఈ కార్య‌క్ర‌మంలో ఉప‌ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి, ర‌వాణాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఎంటీ కృష్ణ‌బాబు.ర‌వాణాశాఖ క‌మిష‌న‌ర్ పీఎస్ఆర్ ఆంజ‌నేయులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: