ఏపీ స్టేట్ కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పోరేష‌న్ కు బోర్డును నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏపీ కాపు సంక్షేమ‌, అభివ్ర‌ద్ది కార్పోరేష‌న్, విజ‌య‌వాడ మేజేజింగ్ డైరెక్ట‌ర్ సిఫార‌సు మేర‌కు బోర్డుని నియమించిన‌ట్టు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌కు అధికార, అనధికార డైరెక్టర్ల నియామిస్తూ ప్రభుత్వం కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.

 అధికారిక డైరెక్టర్లుగా ఏడుగురు, అనధికార డైరెక్టర్లుగా 12 మందిని నియమిస్తూ ఉత్తర్వులలో పేర్కొన్నది. నామినేటెడ్ ఛైర్మన్ లేనిపక్షంలో ఎక్స్‌ అఫీషియో ఛైర్మన్‌గా బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి ఉంటారని, అధికారిక  డైరెక్ట‌ర్ లుగా ఏపి బిసి వెల్పేర్ డైరెక్ట‌ర్, ఏపి బిసిసిఎఫ్సి లిమిటెడ్, సిఇవో, ఎండి, ఏపిఎస్ కెడ‌బ్లుడి, ఎండి వ్యవహరించనున్నారు. మరో పక్క ఆర్ధిక శాఖ అడిష‌న‌ల్ సెక్ర‌ట‌రీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ జాయింట్ డైరెక్ట‌ర్ ల‌ను నియ‌మిస్తూ ఉత్త‌ర్వులలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: