ఎమ్మీ నామినేటెడ్ ఆంథాలజీ సినిమా అయిన లస్ట్ స్టోరీస్‌ రిలీజ్ అయి నేటికి మూడేళ్ళు అయ్యింది. జూన్ 15, 2018 న విడుదలైన ఈ ఆంథాలజీ సినిమా లో కియారా అద్వానీ మరియు నేహా ధూపియా, మేఘా మరియు రేఖ కీలక పాత్రలు పోషించారు. ఇక కియారా అద్వానీ మరియు నేహా ధుపియా ఈ మూడవ వార్షికోత్సవం సందర్భంగా తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో లస్ట్ స్టోరీస్ నిర్మాత ఆర్‌ఎస్‌విపి మూవీస్ పోస్ట్‌ను పంచుకున్నారు. 

నాలుగు లఘు చిత్రాలతో కూడిన, ఈ లస్ట్ స్టోరీస్ అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ మరియు కరణ్ జోహార్ అనే నలుగురు ప్రముఖ దర్శకులు తెరకెక్కించారు. ఇందులో రాధికా ఆప్టే, భూమి పెడ్నేకర్, కియారా అద్వానీ, మనీషా కొయిరాలా, విక్కీ కౌషల్, నీల్ భూపాలం, నేహా ధూపియా, సంజయ్ కపూర్, జైదీప్ అహ్లవత్, ఆకాష్ తోసార్ నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: