తెలుగులో బుర్ర‌క‌థ సినిమాలో క‌థానాయిక‌గా న‌టించిన నైరాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాద‌క ద్ర‌వ్యాల కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు నైరాషాను అరెస్ట్ చేశారు. డ్ర‌గ్స్ ఉప‌యోగిస్తున్నార‌న్న స‌మాచారం అంద‌డంతో ముంబ‌యి జుహూలోని ఒక హోట‌ల్ గ‌దిలో ఎన్సీబీ అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు. నైరా షా, ఆమె స్నేహితుడు ఆశిఖ్ సాజిద్ హుస్సేస్‌ను ఇద్ద‌రినీ అరెస్ట్ చేశారు. సిగిరెట్‌లో చుట్టిన ఒక గ్రాము గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి నైరాషా పుట్టిన‌రోజు కావ‌డంతో హోట‌ల్ లో పార్టీ చేసుకొని గంజాయి తీసుకున్న‌ట్లు స‌మాచారం రావ‌డంతో తెల్ల‌వారుజామున మూడుగంట‌ల‌కు త‌నిఖీలు చేప‌ట్టి ఇద్ద‌రినీ అదుపులోకి తీసుకున్నారు. గంజాయి వీరికి ఎవ‌రు స‌ర‌ఫ‌రా చేశారు? మ‌ధ్య‌వ‌ర్తులెవ‌రు? ఇంకా ఎవ‌రైనా ఉన్నారా? అనే కోణంలో ఎన్‌సీబీ అధికారులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: