జూన్ 18 నుంచి ప్రారంభ‌మ‌య్యూ వ‌రల్డ్ టెస్ట్ ఛాపింయ‌న్ షిప్ ఫైన‌ల్‌కు భార‌త 15 మంది స‌భ్యుల జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది.20 మంది ఆట‌గాళ్ల‌తో టీమిండియా ఇంగ్లాండ్ వెళ్లింది. సౌతాంప్ట‌న్‌లో న్యూజిలాండ్‌తో విరాట్ కోహ్లి కెప్టెన్‌గా,అజింక్య ర‌హానె వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. టీమ్ స‌భ్యులుగా రోహిత్ శ‌ర్మ‌,శుభ‌మ్ గిల్‌,ఛ‌టేశ్వ‌ర‌పుజారా, విరాట్‌కోహ్లీ,అజింక్య ర‌హానే,హ‌నుమ‌విహారి,రిష‌బ్‌పంత్‌, వృద్దిమాన్ సాహా,ర‌వించంద్ర‌న్ అశ్విన్‌, ర‌వీంద్ర జ‌డేజా,జ‌స్ప్రిత్ బూమ్రా, ఇషాంత్ శ‌ర్మ‌,మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ,ఉమేష్ యాద‌వ్‌,ఎమ్‌డీ సిరాజ్‌లు ఉన్నారు.ఫాస్ట్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌, మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మ‌న్ హ‌నుమావిహారి,సీనియ‌ర్ పేస‌ర్ ఉమేష్ యాద‌వ్‌కు చోటు ద‌క్కింది.వృద్దిమాన్ సాహాని రిష‌బ్‌పంత్‌కి బ్యాక్అప్ వికెట్ కీప‌ర్‌గా తీస‌కున్నారు అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ‌తోపాటు ఓపెన‌ర్‌గా శుభ‌మ్‌గిల్ ఆడ‌నున్నారు.వీరిద్ద‌రి ఓపెనింగ్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: