సెంట్రల్ నేపాల్లో వరద బీభత్సం కొనసాగుతుంది. ఒక్కసారిగా వరదలు రావడంతో ప్రజలు గల్లంతైనట్లు తెలుస్తుంది అంతేకాకుండా ఈ వరదల్లో ఒకరు మరణించినట్లు సమాచారం. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరదలు సంభవించాయి. దాంతో అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.  ఈ ఘటనపై సింధు పాల్ చౌక్ జిల్లా అధికారి అరుణ్ మీడియాతో మాట్లాడుతూ... మేలంచి మరియు ఇంద్రావతి నదుల నుండి వరదలు ఉద్భవించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఒకరు మాత్రమే మరణించినట్టు గుర్తించామని చెప్పారు.







మరింత సమాచారం తెలుసుకోండి: