ఆగ్రా లో విషాద ఘటన చోటు చేసుకుంది. కాగ్ రోల్ ప్రాంతంలో భారీ గోడ కూలి ముగ్గురు పిల్లలు మరణించారు. అంతేకాకుండా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు.

అంతేకాకుండా చనిపోయిన ముగ్గురు పిల్లల వయసు కూడా...మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్య మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం తొమ్మిది మంది ఈ ఘటనలో గాయపడినట్టు జిల్లా మెజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: