తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన గొప్ప పధకాల్లో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పధకం కూడా ఒకటి. ఈ పధకం కింద అర్హులైన ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం సహాయం చేస్తోంది. అయితే తాజాగా ఈ పధకం దరఖాస్తు చేసుకోవడానికి విధించిన డెడ్ లైన్ మరింత పెంచారు. ఇక ఈ పధకం కింద 20 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తోంది. 


ఈ స్కీం కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ సభ్యుల సంవత్సర ఆదారం రూ. 5 లక్షల లోపు ఉండాలి అలాగే వయస్సు జూలై 1 నాటికి 35 ఏళ్లు లోపు వారు అయి ఉండాలి. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా దేశాల్లోని యూనివర్సిటీల్లో పీజీ చేయాలనుకుంటున్న విద్యార్థులు ఈ పధకానికి అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులు అప్లై చేసుకోవాల్సిన వెబ్ సైట్: telanganaepass.cgg.gov.in

మరింత సమాచారం తెలుసుకోండి: