కరోనా కాలంలో వివిధ రకాలుగా సహాయం చేస్తున్న హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి బాధితులకు చేయూత అందించారు. హిందూపురం నియోజకవర్గ ప్రజల కోసం తాజాగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మూడు లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ లు అందుబాటులో ఉంచారు. కరోనా బాధితులలో ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న వారు ఎమ్మెల్యే నివాసం వద్ద సంప్రదిస్తే ఈ ఆక్సిజన్ సౌకర్యం కల్పిస్తారని తెలుస్తోంది. 

అలాగే ఇప్పటికే కోవిడ్ కిట్లు సైతం ఎమ్మెల్యే నివాసం వద్ద అందుబాటులో ఉన్నాయని అవసరమైన వారు తీసుకోవచ్చని చెబుతున్నారు. ఇక తాను అందుబాటులో ఉన్నా లేకపోయినా ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా అండగా నిలుస్తున్న బాలకృష్ణ ఈ నియోజకవర్గానికి ఎప్పటికీ ఎమ్మెల్యేగా ఉండాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: