తెలంగాణా రాజకీయాల్లో చక్రం తిప్పి అధికారంలోకి రావాలని భావిస్తున్న వైఎస్ షర్మిల ఈరోజు నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా మిర్యాలగూడలో ఉన్న ఎండీ సలీం కుటుంబాన్ని పరామర్శించనున్న షర్మిల, 11 గంటలకు సూర్యాపేట జిల్లా మేడారంలో నిరుద్యోగి సాయిని పరామర్శించి అక్కడే నిరుద్యోగులతో సమావేశం కానున్నారు. 


ఇక 1 గంటకు హుజూర్ నగర్ వెళ్లనున్న ఆమె వైఎస్ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. ఇక 3గంటలకు దొండపాడులో గున్నం నాగిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించనున్న షర్మిల, ఆ తరువాత 5 గంటలకు కోదాడ, గుంజలూరు మీదుగా హైదరాబాద్ తిరిగి రానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: