విశాఖపట్నం జిల్లాలో ఎన్ కౌంటర్ కలకలం రేగుతోంది. ఏజెన్సీ ప్రాంతం అయిన కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ తెల్లవారుజామున కూంబింగ్ కు వెళ్ళిన గ్రేహాండ్స్‌ దళాలు, ఎదురు పడిన మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. 


అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న గ్రేహాండ్స్‌ దళాలకు మావోయిస్టులు ఎదురు పడడంతో ఎదురు కాల్పులు జరిగినట్లు తెలిసింది. గంట పాటు ఎదురు కాల్పులు జరగ్గా అయిదుగురు మావోయిస్ట్ లు చచ్చిపోయారని అయితే చాలా మంది మావోయిస్టులు తప్పించుకున్నారని అంటున్నారు. ఇక మంప పరిధిలోని అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: