ఛండీఘర్లో 15 ఏళ్ల బాలుడిన గర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.అయితే బాలుడి తల్లిదండ్రులకు కిడ్నాపర్లు
ఫోన్ చేసి 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాగా కొన్నగంటల తరువాత కిడ్నాపర్లు డబ్బులు తీసుకోకుండానే బాలుడిని వదిలిపెట్టారు.మణిమజ్రాలో బాలుడు తన స్నేహితులతో కలిసి సైక్లింగ్కి వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది.మణిమజ్రాలో రైల్వే క్రాసింగ్ దగ్గర ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి కారులో తీసుకెళ్లినట్లు తెలసిందని బాలుడి
తండ్రి తెలిపారు.తన కుమారుడు కావాలంటే 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారిని..డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారని అన్నారు.అయితే బాలుడి కిడ్నాప్ విషయాన్ని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో అలెర్టైన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టారు. అయితే కిడ్నాపర్లు బాలుడిని పలు ప్రదేశాల్లో తిప్పిన తరువాత పంచకులలోని సెక్టార్21 వంతెన వద్ద వదిలిపెట్టి పారిపోయిరు.బాలుడిని కుటుంబసభ్యులకు అప్పగించిన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.