వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీల వద్ద
కేంద్ర ప్రభుత్వం భద్రతను ఏర్పాటు చేసింది.ఇందులో భాగంగా
మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ తుర్కపల్లి లోని
భారత్ బయో టెక్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 64 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించారు.ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో భారత్ బయోటెక్కి భద్రత కల్పించనున్నారు.దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారు చేస్తున్నల్యాబ్ల భద్రత పెంచాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం అమలవుతుంది.కరోనా విపత్కర పరిస్థితుల్లో వ్యాక్సిన్ మాత్రమే సంజీవనని నిపుణులు అంటున్నారు.అయితే దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత ఇంకా కొనసాగుతూనే ఉంది.