ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఉంగుటూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఇటీవలే అనారోగ్యానికి గురై కోలుకున్నారు. ఆయన్ని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వెళ్లారు. శ్రీధర్ రాకను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఆయన కారును అడ్డుకున్నారు. అడ్డంగా బైఠాయించి నినాదాలు చేయడంతో కొమ్మాలపాటికి అనుకూలంగా గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య బాహాబాహీ నెలకొనే ప్రమాదం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దమణిగింది. రాజధాని అమరావతి ప్రాంత పరిధిలోని పలు గ్రామాల్లో తరుచూ వివాదాలు జరుగుతున్నాయి. వైసీపీ, తెలుగుదేశం శ్రేణుల మధ్య స్వల్ప విషయాలకు కూడా గొడవ తలెత్తుతోంది. స్థానిక నేతలే ఇందుకు కారణమంటూ ఒకరిపై మరొకరు ఆరోపించుకోవడం ఇక్కడ సర్వసాధారణమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఉంగుటూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఇటీవలే అనారోగ్యానికి గురై కోలుకున్నారు. ఆయన్ని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వెళ్లారు. శ్రీధర్ రాకను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఆయన కారును అడ్డుకున్నారు. అడ్డంగా బైఠాయించి నినాదాలు చేయడంతో కొమ్మాలపాటికి అనుకూలంగా గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య బాహాబాహీ నెలకొనే ప్రమాదం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దమణిగింది. రాజధాని అమరావతి ప్రాంత పరిధిలోని పలు గ్రామాల్లో తరుచూ వివాదాలు జరుగుతున్నాయి. వైసీపీ, తెలుగుదేశం శ్రేణుల మధ్య స్వల్ప విషయాలకు కూడా గొడవ తలెత్తుతోంది. స్థానిక నేతలే ఇందుకు కారణమంటూ ఒకరిపై మరొకరు ఆరోపించుకోవడం ఇక్కడ సర్వసాధారణమైంది.