మంత్రి చెప్పడంవల్లే తాము పూర్ణకుంభంతో స్వాగతం పలకలేకపోయామని, క్షమించాలని సింహాచలం దేవస్థానం అధికారులు కేంద్ర మాజీ మంత్రి, ట్రస్ట్ ఛైర్మన్ అశోక్గజపతిరాజుకు విన్నవించారు. ఈరోజు అశోక్గజపతిరాజు కుటుంబ సమేతంగా సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. మాన్సాస్ ట్రస్, సింహాచలం ట్రస్ట్ చైర్మన్గా సంచయిత నియామకాన్ని కొట్టివేసి అశోక్ను పునర్నియమించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ ఆదేశాలు వెలువడిన తర్వాత తొలిసారిగా ఆయన అప్పన్న దర్శనానికి వచ్చారు. ఆలయ అధికారులు అశోక్గజపతిరాజును స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కేవలం సామాన్య భక్తుడిలా స్వామిని దర్శించుకున్నానని, కనీస మర్యాదలు కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి చెప్పడంవల్లే తాము పూర్ణకుంభంతో స్వాగతం పలకలేకపోయామని, క్షమించాలని సింహాచలం దేవస్థానం అధికారులు కేంద్ర మాజీ మంత్రి, ట్రస్ట్ ఛైర్మన్ అశోక్గజపతిరాజుకు విన్నవించారు. ఈరోజు అశోక్గజపతిరాజు కుటుంబ సమేతంగా సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. మాన్సాస్ ట్రస్, సింహాచలం ట్రస్ట్ చైర్మన్గా సంచయిత నియామకాన్ని కొట్టివేసి అశోక్ను పునర్నియమించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ ఆదేశాలు వెలువడిన తర్వాత తొలిసారిగా ఆయన అప్పన్న దర్శనానికి వచ్చారు. ఆలయ అధికారులు అశోక్గజపతిరాజును స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కేవలం సామాన్య భక్తుడిలా స్వామిని దర్శించుకున్నానని, కనీస మర్యాదలు కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.