చిత్తూరు జిల్లా పుదిపుట్లలో ఆనంద‌య్య మందు పంపిణీని పోలీసులు అడ్డుకున్నారు.స్థానిక స‌ర్పంచ్ బ‌డి సుధాయాదవ్ ఆధ్వ‌ర్యంలో ఆనంద‌య్య మందును పంపిణీ చేస్తుండ‌గా..ఎమ్ఆర్ ప‌ల్లి పోలీసులు అడ్డ‌కున్నారు.ప్ర‌జ‌ల ఆరోగ్యంకోసం స్వ‌యంగా తానే ఆనంద‌య్య‌ను క‌లిసి మందు తెప్పించాన‌ని..ప్ర‌భుత్వం మందు పంపిణీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే పోలీసులు అడ్డుకోవ‌డం ఏంట‌ని సుధాయాద‌వ్ ప్ర‌శ్నించారు.నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా మందు పంపిణీ చేస్తున్నా పోలీసులు ప‌ట్టించుకోకుండా తాను మందు పంపిణీ చేస్తుంటే అడ్డుకోవ‌డం దారుణ‌మ‌న్నారు. కుట్ర‌లో భాగంగానే పోలీసులు ఇలా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని.. ఎన్ని కేసులు పెట్టినా పంచాయ‌తీ ప్ర‌జ‌ల ఆరోగ్యం కోసం వెనుకాడ‌న‌ని సుధాయాద‌వ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: