ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 9వ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వైద్యులు సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పేశారు.

అనంతరం డిప్యూటీ ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సునీల్ చౌదరి మాట్లాడుతూ...తమకు రాత్రి 10:30 నిమిషాలకు ఫోన్ వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని...ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. మంటలు చెలరేగిన వార్డ్ కోవిడ్ పేషంట్స్ చికిత్స కోసం వినియోగిస్తున్నారు. అయితే పేషంట్స్ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: