తూర్పుగోదావరి జిల్లా  ముమ్మిడివరంలో వైసిపి అభిమాని పుట్టినరోజు సంద్భంగా యువకులు హల్ చల్ చేశారు. ముమ్మిడివరం జాతీయ రహదారిపై కత్తులు పట్టుకుని ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. వివరాల్లోకి వెళితే...మాజీ కౌన్సిలర్ కుమారుడు వైసీపీ అభిమాని యలమెల్లి దుర్గాప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా యువకులు కేక్ కట్ చేసి హంగామా చేశారు. కర్ఫ్యూ నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా  యువకులు కత్తులతో రోడ్లపై హల్ చల్ చేశారు.స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: