వివాద‌స్ప‌దంగా మారిని మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్ ప‌ద‌విని ఎట్టేకేల‌కు కోర్టు ద్వారా అశోక్‌గ‌జ‌ప‌తిరాజు ద‌క్కించుకున్నారు.మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అశోక్‌గ‌జ‌ప‌తిరాజు సిబ్బందికి వేత‌నాలు చెల్లించ‌క‌పోవ‌డంపై అసహ‌నం వ్య‌క్తం చేశారు. కోటిప‌ల్లి ట్ర‌స్టు భూముల్లో ఇసుక త‌వ్వ‌కాలు జ‌ర‌గ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించారు.అస‌లు ట్ర‌స్ట్ భూముల్లో ఇసుక త‌వ్వ‌కాలు ఎవ‌రు అనుమ‌తించారో నివేదించాల‌ని కోరారు.మాన్సాస్ విద్యాసంస్థ‌ల బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు ఇవ్వాల‌ని వారం రోజుల్లో బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు త‌యారు చేసి పంపాల‌న్నారు. ట్ర‌స్ట్‌కు సంబంధించి రూ.5ల‌క్ష‌ల దాటిన కోనుగోళ్ల వివ‌రాలు రెండు రోజుల్లో ఇవ్వాల‌ని ..గ‌తేడాది ఏప్రిల్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కొనుగోళ్ల వివ‌రాలు ఇవ్వాల‌ని ఆదేశించారు.లీజు గ‌డువు పూర్త‌యిన ట్ర‌స్ట్ భూముల‌ను వేలం వేయాల‌ని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: