రాజధాని విశాఖపట్నం  రావడం ఖాయం అని పదేపదే చెబుతున్నామని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలోనే వస్తుంది, తేది ఎప్పుడు అనేది మేం చెప్తామని ఆయన అన్నారు. ఇక వాల్యూ బేస్డ్ టాక్స్ విధానం  దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయమే అని దాన్ని మనం కూడా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 


15 శాతం కన్నా ఎక్కువగా పెరిగే అవకాశం లేదన్న ఆయన స్లమ్స్ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకున్నప్పుడు  గ్యారెంటీ కింద ప్రభుత్వ ఆస్తులు పెట్టడం అనేది ఈ రోజు కొత్తగా వచ్చింది ఏమీ కాదన్న ఆయన ఈ పద్ధతి ఎప్పటి నుంచో వస్తున్నదేనని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: