కరోనా ఇప్పటికే దేశంలో ఎంతో విషాదాన్ని నింపింది..మహమ్మారి బారిన పడి పలువురు ప్రముఖులు సెలబ్రిటీలు కూడా దూరమయ్యారు. కాగా తాజాగా దిగ్గజ అథ్లెట్ కరోనాకు బలయ్యారు. ప్రముఖ స్పిన్నర్ మిల్కా సింగ్(90) ఇక లేరు. మే 20న మిల్కా సింగ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దాంతో మే 23న ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.

ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో ఆయనకు వెంటిలేటర్ చికిత్స ప్రారంభించారు. ఇక శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. మూడు సార్లు ఒలంపిక్స్ కి వెళ్ళిన మిల్కా సింగ్ గోల్డ్ మెడల్ సాధించారు. దేశానికి గుర్తింపు తీసుకురావడమే కాకుండా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఇలా ఉండగా ఆయన సతీమణి కూడా ఇటీవలే కరోనా తో కన్నుమూసింది. ఇప్పుడు మిల్కా సింగ్ కూడా మరణించడం బాధాకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: