తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా లాక్ డౌన్ పై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు విధించిన లాక్ డౌన్ పీరియడ్ ఈ రోజుతో ముగియనుంది .

ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను పొడగించా లా సడలించాలా అన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే గతంలో లో లాగానే కొన్ని ప్రాంతాలకు లాక్ డౌన్ కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా ఇంకా అదుపులోకి రాని నల్గొండ, మధిర, సత్తుపల్లి, నాగార్జునసాగర్, మునుగోడు, దేవరకొండ ,మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలో లాక్ డౌన్ ను కొనసాగించేలా నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: