ఫ్లయింగ్ సిక్ మిల్కా సింగ్ మరణవార్త యావత్ క్రీడా లోకాన్ని విషాదంతో నింపింది. మిల్కా సింగ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. సెలబ్రిటీలు, నాయకులు నివాళులు అర్పిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మిల్కా సింగ్ మృతి పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిల్కా సింగ్ తో కలిసి దిగిన ఫోటోను మోడీ షేర్ చేశారు. ఈ సందర్భంగా కొద్ది రోజుల క్రితమే మిల్కా సింగ్ తో మాట్లాడనని...అదే చివరి సారి అవుతుందని అనుకోలేదని అన్నారు. 

ఎంతోమందికి మిల్కా సింగ్ రోల్ మోడల్ గా నిలిచారని పేర్కొన్నారు. మోడీ తన మిల్కా మరణం పట్ల ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ కూడా మిల్కా సింగ్ మృతి తనని కలచివేసిందని పేర్కొన్నారు. పలువురు ముఖ్యమంత్రులు, బాలీవుడ్ తారలు ఇతర ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు సోషల్ మీడియా వేదికగా నివాళ్లు అర్పిస్తున్నాను.



మరింత సమాచారం తెలుసుకోండి: