పరుగుల్లో చిరుతను తలపించే మిల్కాసింగ్ మృతి అత్యంత బాధాకరమని మాజీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పరుగు పోటీల్లో భారత ఖ్యాతిని ప్రపంచానికి  చాటిచెప్పారన్న ఆయన గొప్ప అథ్లెట్ ను దేశం కోల్పోయిందని అన్నారు. మిల్కా సింగ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, వారి ఆత్మకు శాంతి కలగాలని భగంతున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఇక బాలకృష్ణ స్పందిస్తూ ఇది చాలా హృదయ విదారక వార్త అని అన్నారు.


 మనం ఈ రోజు ఒక చరిత్రను కోల్పోయామని అనారు. స్వాతంత్ర్యం తరువాత భారతదేశం ఎలా నడవాలి అని చూస్తున్నపుడ, మీరు ఎలా నడుచుకోవాలో చూపించారు. పెద్దగా కలలు కనేలా మీరు మాకు నేర్పించారు, ఆపై అన్ని అసమానతలు ఉన్నప్పటికీ ఆ కలలను వెంటాడి గెలిచారని అన్నారు. మీరు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూ ఉంటారన్న దేశం మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది మరియు మీ జీవితం నుండి ఎప్పటికీ ప్రేరణ పొందుతుందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: