ఈ మధ్య కాలంలో వరుస లేఖలతో జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో లేఖ రాశారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయం విషయంలో అశోక్ గజపతి రాజు కేసు గెలిచారని ఆయన వెల్లడించారు.  ఉత్తరాంధ్ర మీద ప్రతినిధి విజయసాయిరెడ్డి నిరంతరం ఆరోపణలు చేస్తున్నారని,  విజయసాయి రెడ్డిని కట్టడి చేయాలని లేకపోతే పార్టీకి నష్టం చేకూరుతుందని లేఖలో పేర్కొన్న రఘురామకృష్ణం రాజు విజయసాయిరెడ్డిని, మంత్రులను పార్టీ మంచి కొరకు నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో దాగున్న భావోద్వేగం వెల్లువెత్తి 2014 పరిస్థితుల పునరావృత కాకూడదు అని కోరుకుంటున్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: