ఈ మధ్య కాలంలో అసలు ఆడవాళ్ళకి రక్షణే లేకుండా పోతోంది. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒకరకంగా వాళ్ళు బాధలు పడుతున్న విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఘాట్ కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. అయితే ఆ మృతురాలు స్రవంతిగా పోలీసులు గుర్తించారు. 


స్రవంతి ఇటీవల పదో తరగతి పాస్ అయినట్టు సమాచారం. అర్ధరాత్రి ఇంట్లో నుండి బయటకు వెళ్లినట్టు పోలీసులకు తల్లిదండ్రులు చెప్పారని తెలుస్తోంది. సర్వీస్ రోడ్డు పక్కన కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసి పోలీసులకు కాలనీ వాసులు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

orr