టీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ గుడ్ బై చెప్పిన త‌ర‌వాత మ‌రికొంద‌రు కూడా టీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నారంటూ వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు నేత‌ల పేర్లు భ‌య‌ట‌కు రాగా వారిలో జ‌హీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పేరు కూడా ఉంది. అయితే తాజాగా త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను బీబీ పాటిల్ ఖండించారు. తాను టీఆర్ఎస్ పార్టీని వీడే ప్ర‌స్త‌కే లేద‌ని అన్నారు . 

కొంద‌రు యూట్యూబ్ ఛాన‌ల్ ల‌లో తాను పార్టీ మారుతున్న‌ట్టు వీడియోలు చేసి రూమ‌ర్లు క్రియేట్ చేస్తున్నార‌ని అలాంటి వారిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌ని చెప్పారు. ఇక ఈ రోజు ఎంపీ బీబీ పాటిల్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేంద‌ర్ తో క‌లిసి ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు సంభంధించిన‌ కోటి రూపాయ‌ల చెక్కుల‌ను పంపిణీ చేశారు .  


మరింత సమాచారం తెలుసుకోండి: