అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. సూర్యాపేట కోదాడ కు చెందిన సిరిపురపు రవి కుమార్ అనే యువకుడు అమెరికా లో సిగ్నల్ ఇన్సూరెన్స్ కంపెనీలో మూడు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. కాగా తాజాగా అతడు తన స్నేహితులతో కలిసి సరదాగా ఓ సరస్సు వద్దకు బోటింగ్ కి వెళ్ళాడు .

అయితే బోటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు . ఈ విషయం తెలియడంతో రవి కుమార్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు . తమ కుమారుడి మృతదేహాన్ని భారత్ కు తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని కోరుతున్నారు . అంతేకాకుండా రవికుమార్ మృతితో గ్రామంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి . స్నేహితులు , బంధువులు రవికుమార్ ఇంటివద్ధకు చేరుకున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: