ప్ర‌పంచ టెస్ట్ చాంపియ‌న్ షిఫ్ ఫైన‌ల్లో న్యూజిలాండ్ జ‌ట్టు భార‌త ఓపెన‌ర్ల‌ను తెలివిగా బోల్తా కొట్టించింది. 62 ప‌రుగుల వ‌ర‌కు ఒక్క వికెట్ కూడా ప‌డ‌లేదు. అయితే కీవీస్ కెప్టెన్ ఎప్పుడు అయితే బౌల‌ర్ల‌ను మార్చారో ఓపెన‌ర్లు ఇద్ద‌రి వికెట్లు ట‌పా ట‌పా రాలిపోయాయి. కీవీస్ బౌల‌ర్లు బంతులు ఎంత స్పీడ్‌గా విసురుతున్నారో మ‌న ఓపెన‌ర్లు కూడా అంతే స్పీడ్‌గా ఆడేశారు. చివ‌ర‌కు ఇద్ద‌రు క్యాచ్‌కు దొరికిపోయారు. ఓపెనర్లు ఇద్దరూ స్పీడ్ గా ఆడకుండా బాల్ పాతది అయ్యే వరకు మొదటి సెషన్ అంతా ఉండి ఉంటే కనీసం 150 భాగస్వామ్యం న‌మోదు అయ్యి ఉండేది. ఇద్ద‌రూ ఒకే ర‌కం బంతుల‌కు దొరికిపోయారు. అందివ‌చ్చిన చ‌క్క‌టి శుభారంభాన్ని వీరు మిస్ చేసుకున్నార‌నే చెప్పాలి. రోహిత్‌శ‌ర్మ‌ను జిమ్మిస‌న్‌, గిల్‌ను వాగ్న‌ర్ అవుట్ చేశారు. ప్ర‌స్తుతం క్రీజ్‌లో ఛ‌టేశ్వ‌ర్ పూజారా, విరాట్ కోహ్లీ ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: