ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. టీం ఇండియా ఓపెనర్ లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇద్దరూ కూడా మంచి భాగస్వామ్యం నెలకొల్పినా భారీ భాగస్వామ్యంగా మలిచే విషయం లో మాత్రం ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు క్రీజ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, పుజారా ఉన్నారు. అయితే పుజారా కంటే కూడా విలియమ్సన్ కోహ్లీని టార్గెట్ చేసాడు.

కోహ్లీ నిలబడితే భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉన్న నేపధ్యంలో అతన్ని గతంలో ఎక్కువ సార్లు అవుట్ చేసిన న్యూజిలాండ్ కీలక బౌలర్ నీల్ వాగ్నర్ ని రంగంలోకి దించాడు విలియమ్సన్. అతను పదునైన బంతులతో కోహ్లీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నాడు.  పుజారా కూడా కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అవుట్ స్వింగ్ తో పాటుగా దూరంగా బౌన్సర్ లు విసిరుతూ కోహ్లీ ని రెచ్చగోడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: