ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ని వరుణుడు వదలడం లేదు. నిన్న మొత్తం వర్షార్పణం కాగా నేడు రోజు అంతా మ్యాచ్ జరిగే పరిస్థితి అయితే కనపడటం లేదు. బ్యాడ్ లైట్ కారణంగా తొలి ఇన్నింగ్స్ 59 వ ఓవర్ లో మ్యాచ్ ని ఆపేశారు అంపైర్ లు. టీ సెషన్ కూడా బ్యాడ్ లైట్ కారణంగా నిలిపివేశారు. ఈ రోజు 98 ఓవర్లు ఆడాలని టార్గెట్ గా పెట్టుకున్నా సరే వెలుతురు సహకరించే పరిస్థితి లేదు.

దీనితో టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ విజేత తేలే అవకాశం ఉందా లేదా అనేది క్లారిటీ రావడం లేదు. టీం ఇండియా 3 వికెట్ ల నష్టానికి 134 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో 40 పరుగులతో రహానే 22 పరుగులతో ఉన్నారు. పిచ్ బౌలింగ్ కి సహకరించడంతో ఆచితూచి ఆడుతున్నారు. ఇద్దరూ 111 బంతుల్లో 46 భాగస్వామ్యం నెలకొల్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: