దేశ‌వ్యాప్తంగా వర్షాలు మొద‌ల‌య్యాయి. కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్ర‌తి యేడాది కంటే ఈ యేడాది వర్షాలు మొద‌ట్లోనే జోరందుకున్నాయి. ఇక భారీ వర్షాల‌తో రోడ్లు జ‌ల‌మయం అవ్వ‌డం...ర‌హదార్లు కొట్టుకుపోవడం లాంటి ఘ‌ట‌న‌లు కూడా చోటు చేసుకుంటున్నాయి. కాగా తాజాగా ఉత్త‌రాఖండ్ లోని జ‌స్పూర్ గ్రామానికి చెందిన 20 మంది ప్ర‌జ‌లు వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్నారు. వారిని ప్ర‌త్యేక బృంధాల‌తో క‌లిసి పోలీసులు ర‌క్షించారు.

అంతే కాకుండా దానికి ప‌క్క‌నే ఉన్న మ‌రో గ్రామ ప్ర‌జ‌లు కూడా 20 మంది వ‌ర‌దల్లో చిక్కుకున్నారు. ప్ర‌స్తుతం వారి కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఎస్డీఆర్ ఎఫ్ బృంధాలు మ‌రియు పోలీసులు వారిని ర‌క్షించేపనిలో ఉన్నారు. ఇక ఉత్త‌రాఖండ్ లో కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా లోత‌ట్టు ప్రాంతాల్లో ఉంటే ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఇప్ప‌టికే అధికారులు కూడా హెచ్చ‌రిక‌లు జారీచేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: