మహిళల రక్షణకు సంబంధించి ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా వారి మీద జరుగుతున్న అఘాయిత్యాలు ఆగడం లేదు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అయితే ఆడవారి రక్షణకు కంకణం కట్టుకుందని చెబుతూ దిశ అనే చట్టాన్ని కూడా అమలులోకి తీసుకు రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. అలాంటి ఆంధ్రప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 


ముఖ్యమంత్రి వైయస్ జగన్ నివాసం ఉండే తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్ లో ఒక ప్రేమ జంట మీద అఘాయిత్యం జరిగింది. సీతానగరం పుష్కర ఘాట్ సమీపంలో ఉన్న కృష్ణా నది ఇసుక తిన్నెల మీద ప్రేమ జంట సేదతీరుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఒక రౌడీమూక యువతిపై సామూహిక అత్యాచారం చేసినట్లు సమాచారం. దీంతో ఈ తెల్లవారుజామున తాడేపల్లి పోలీసులకు ప్రేమ జంట వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: