రోజుకు ఒక లేఖ రాస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈరోజు మరో లేఖ రాశారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ కి ఆయన లేఖ రాశారు. ఈ విషయం తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన ఆయన అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ గారికి లేఖ రాయడం జరిగింది అని పేర్కొంటూ వన్ స్టేట్, వన్ క్యాపిటల్ అని కామెంట్ చేశారు. 


కొద్దిరోజుల క్రితమే రఘురామకృష్ణం రాజును రాజద్రోహం కేసు కింద ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడిన ఆయన చివరికి బెయిల్ తెచ్చుకుని రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన వెంటనే ఢిల్లీ వెళ్లిన ఆయన అప్పటి నుంచి ఢిల్లీ లోని తన స్వగృహంలో ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: