వైయస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. క‌డ‌ప సెంట్ర‌ల్ జైలు అడ్డాగా అధికారులు అనుమానితుల‌ను విచారిస్తున్నారు.  ఇప్పటికే వివేకా వద్ద పనిచేసిన ప‌లువురిని విచారించిన సీబీఐ గ‌త మూడు రోజులుగా ముఖ్య అనుచరుడు ఎర్రం గంగిరెడ్డిని విచారిస్తోంది. ఇక ఈరోజు కూడా గంగిరెడ్డిని సీబీఐ విచారించ‌నుంది. అంతే కాకుండా మైన్స్ య‌జ‌మాని గంగాధ‌ర్ ను కూడా విచారిస్తోంది.  

అంతే కాకుండా పులివెందుల కు చెందిన ఓబుల్ పతి నాయుడు సింహాద్రిపురం మండలానికి చెందిన రాఘవేంద్ర, కిషోర్ కుమార్ రెడ్డి లను కూడా ఈరోజు విచారిస్తోంది. వీరిని పలు కోణాల్లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా వివేకా హ‌త్య కేసులో గంగిరెడ్డిని అరెస్ట్ చేయ‌గా కొద్ది రోజ‌ల క్రితం బెయిల్ పై భ‌య‌ట‌కు వ‌చ్చాడు. గంగిరెడ్డి సాక్ష్యాల‌ను తారుమారు చేసిన‌ట్టుగా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: