రోజు రోజుకు మ‌నుషులు మృగాల కంటే దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. చిన్న పిల్ల‌ల నుండి ముస‌లి వాళ్ల‌పై సైతం అత్యాచారానికి యత్నించిన ఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా కోదాడ‌లోని తిరుమల ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీపై ల్యాబ్ టెక్నీషియన్ శ్రీకాంత్ అత్యాచార యత్నానికి పాల్ప‌డ్డాడు. భాదితురాలు కేకలు వేయడంతో కామాందుడు పరారీ అయ్యాడు. కోవిడ్ టెస్టులు చేయాలంటూ గదిలోకి తీసుకెళ్లి నీచంగా ప్ర‌వ‌ర్తించాడు.

బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. కేసు వాపస్ తీసుకోవాలంటూ ఓ ప్రజాప్రతినిధితో భాదితులపై ఒత్తిడి  ఆస్పత్రి నిర్వాహకులు ఒత్తిడి తీసుకువ‌స్తున్న‌ట్టు తెలుస్తుంది. గ‌ర్భ‌వ‌తి అని చూడ‌కుండా అత్యాచార య‌త్నానికి ప్ర‌య‌త్నించిన నింధితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని మ‌హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలి కుటుంబ స‌భ్యులు కూడా ఈ ఘ‌ట‌న పై తీవ్రంగా స్పందిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: