హైకోర్టు తీర్పుతో అశోక్ గ‌జ‌ప‌తి రాజు మ‌ళ్లీ మాన్సాస్ ట్ర‌స్ట్ చైర్మెన్ గా నియామ‌కం కావ‌డం తెలిసిందే. అయితే ఆ రోజు నుండి వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి త‌న స్టైల్ లో అశోక్ గ‌జ‌ప‌తి రాజుపై విమ‌ర్శ‌లు కురిపిస్తునే ఉన్నారు. అశోక్ గ‌జ‌ప‌తి రాజు ట్ర‌స్ట్ భూముల‌ను అమ్మేశార‌ని ...500 ఎక‌రాలు కాజేశార‌ని ఇటీవ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా తాజాగా ఈ రోజు కూడా మ‌ళ్లీ విజ‌య‌సాయి విరుచుకుపడ్డారు .  

పదవుల కోసం అశోక్ గజపతి మాన్సాస్ ట్రస్టును బాబుకు తాకట్టు పెట్టాడని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇద్దరూ కలిసి భూముల్ని అమ్ముకుని పంచుకున్నారంటూ మండి ప‌డ్డారు. నిప్పు, ఉప్పు అని చెప్పుకునే వ్యక్తుల బండారం త్వరలోనే బయటపడుతుందని విజ‌య‌సాయి పేర్కొన్నారు. తప్పు చేసి తప్పించుకోలేరు. అన్నిటికి టైం వస్తుందంటూ హెచ్చ‌రించారు .

 

మరింత సమాచారం తెలుసుకోండి: