ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలర్ పిచ్ నుంచి వస్తున్న సహకారాన్ని చాలా చక్కగా వాడుకుంటున్నారు. పిచ్ పై బంతి బాగా స్వింగ్ కావడంతో దూకుడుగా ఆడలేక కివీస్ బౌలర్ల ధాటికి భారత జట్టు కీలక ఆటగాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు.. ప్రతీ బంతి కూడా పక్కా ప్లానింగ్ విసురుతున్నారు. ఇప్పటికే ఇండియా నాలుగు వికెట్ కోల్పోయింది. ఓపెనర్లతో పాటుగా పుజారా, కోహ్లీ కూడా అవుట్ అయ్యారు.

ప్రస్తుతం రహానే, పంత్ క్రీజ్ లో ఉండగా... పంత్ క్రీజ్ లోకి వచ్చిన వెంటనే ట్రెంట్ బౌల్ట్ భయపెట్టాడు. బంతి ప్యాడ్స్ కి నేరుగా తాకడంతో రివ్యూకి వెళ్ళగా పంత్ నాట్ అవుట్ గా బయటపడ్డాడు. ఆ తర్వాత జేమిసన్ బౌలింగ్ లో టాం లాథం కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.22 బంతులు ఆడి ఒక ఫోర్ సాయంతో  4 పరుగులు చేసాడు పంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: