సౌతాంప్టన్ పిచ్ దెబ్బకు టీం ఇండియా బ్యాట్స్మెన్ కి మైండ్ పోతుంది. పిచ్ మీద నుంచి వస్తున్న సహకారాన్ని న్యూజిలాండ్ బౌలింగ్ విభాగం చక్కగా వాడుకుంటుంది. టీం ఇండియా కీలక ఆటగాళ్ళు అందరిని కూడా టార్గెట్ చేసి అవుట్ చేసారు. పిచ్ మీద స్వింగ్ ఎక్కువ కావడం గాలి ప్రభావం కూడా కాస్త ఎక్కువగా ఉన్న నేపధ్యంలో బౌలింగ్ విభాగం చెలరేగిపోతుంది.

ఇక రహానే నిలబడ్డాడు అనుకునే లోపు వికెట్ కోల్పోయాడు. అర్ధ సెంచరీ ముంగిట వికెట్ చేజార్చుకున్నాడు. మంచి ఫోర్ లు కొడుతూ దూకుడు మీదున్నట్టు కనిపించాడు. కీవీస్ బౌలింగ్ విభాగం మీద ఎదురు దాడి మొదలుపెట్టి వాగ్నర్ బౌలింగ్ లో వికెట్ చేజార్చుకున్నాడు. ప్రస్తుతం ఇండియా 182 పరుగులకు 6 వికెట్ లు కోల్పోయింది. అశ్విన్, జడేజా క్రీజ్ లో ఉన్నారు. రహానే 49 పరుగులకు అవుట్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: