సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా 213 పరుగులకే ఆల్ అవుట్ అయింది. న్యూజిలాండ్ పేసర్ లు టీం ఇండియా బ్యాటింగ్ లైనప్ ని ఏ దశలో కూడా కోలుకోనీయకుండా కకావికలం చేసారు. ప్రధానంగా యువ బౌలర్ జేమిసన్ మంచి పేస్ అటాక్ తో ఇండియా బ్యాటింగ్ ని బాగా ఇబ్బంది పెట్టాడు.

టీం ఇండియాలో విరాట్ కోహ్లీ 44 పరుగులు రహానే 49 పరుగులు చేయగా గిల్ 28, అశ్విన్ 22 పరుగులతో కాస్త పర్వాలేదనిపించారు. జడేజా దూకుడుగా ఆడాలని భావించినా సరే సాధ్యం కాలేదు. పిచ్ పేస్ బౌలింగ్ కి అనుకూలిస్తున్న సమయంలో కెప్టెన్ కోహ్లీ ఇద్దరు సీనియర్ స్పిన్నర్లను జట్టులోకి తీసుకోవడంతో ఏ మాత్రం రాణిస్తారు అనేది ఆసక్తికరంగా మారిన అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: