గత కొద్ది రోజులుగా తెలంగాణ టిపిసిసి చీఫ్ ను ప్రకటిస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీకి బయలుదేరడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కోమటిరెడ్డి కి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టిపిసిసి చీఫ్ బాధ్యతలు కోమటి రెడ్డి కి అప్పగించే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

సీనియర్ల మద్దతు ఉండడం నేతలందరినీ కలుపుకుపోయే తత్వం  ఉండటంతో కోమటిరెడ్డి వైపే అదిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా దీనిపై దాదాపు రేపు ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలాఉండగా ఇటీవలే ఎంపీ రేవంత్ రెడ్డి కూడా హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు అప్పుడు కూడా ఇలాంటి వార్తలు వినిపించాయి. కానీ ఆ తరవాత ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: