ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల విషయంలో ఇప్పుడు కొన్ని విమర్శలు మనం తరుచుగా వింటూ వస్తున్నాం. రాజకీయంగా కూడా పోలీసుల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కొందరు పోలీసులను టార్గెట్ గా చేసుకుని విపక్షాలు ఆరోపణలు కూడా చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో వివాదం పోలీసుల విషయంలో బయటకు వచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అమరారెడ్డినగర్‌ యువతిని మరోసారి స్టేషన్‌ కు పోలీసులు పిలవడం వివాదాస్పదం అయింది.

రెండ్రోజుల క్రితం విచారణ పేరుతో శివశ్రీని స్టేషన్‌లో ఉంచారు. ఇళ్ల నిర్వాసితులకు అన్యాయం జరిగిందంటూ ఈ నెల 7న పవన్‌ను కలిసిన శివశ్రీ... ఆయనకు తమ సమస్యలను వివరించారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించిందని రెండో సారి స్టేషన్ కు తరలించిన పోలీసులు... అక్కడ ఆమెను విచారిస్తున్నారు. శివ శ్రీ ను విడుదల చేయాలని స్దానికులు డిమాండ్ చేయడమే కాకుండా అవసరమైతే స్టేషన్ ముట్టడిస్తామని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: