బీజేపీ  అగ్ర నేత ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఆరోగ్యం విషమంగా మారినట్టుగా వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. వెంటిలేటర్ సపోర్ట్ తో డాక్టర్స్ ఆయనకు వైద్యం అందిస్తున్నారు. గత కొద్దిరోజులు క్రితం లక్నో లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూవెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ లో చేరిన కళ్యాణ్ సింగ్... కోలుకున్నారని వార్తలు వచ్చినా సరే మళ్ళీ ఆయన ఆరోగ్యం విషమించింది.

ఆయన అనారోగ్యంపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందిస్తూ కోలుకోవాలని పోస్ట్ లు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ  జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, అలాగే దక్షినాది అగ్ర బీజేపీ  నేతలు అందరూ కూడా సోషల్ మీడియాలో తమ సంతాపం వ్యక్తం చేసారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి కాసేపట్లో కీలక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp