కడపలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ లో హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. కంట్రోల్ రూమ్ లో ఉన్న ఫ్యాన్ కు ఉరి వేసుకుని విజయ్ కుమార్ హత్యకు పాల్పడ్డారు. ఉదయం కంట్రోల్ రూమ్ వద్దకు వెళ్లిన సిబ్బంది డోర్ కొట్టడంతో ఎవరు తీయలేదు. దాంతో కిటికీ లో నుంచి చూడగా ఫ్యాన్ కు విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపించింది.

 దాంతో సిబ్బంది వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే విజయ్ కుమార్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వరుస ఆరోగ్య సమస్యల వల్లే మనస్థాపానికి గురి అయ్యాడని ఈ నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు బంధువులు చెబుతున్నారు. ఇక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: