గుంటూరు పెదకాకాని లో ఓ వ్యక్తి తన బెంజ్ కార్ తాళం పోయిందని పెట్రోల్ పోసి తగలపెట్టాడు. రెంటచింతల మండలం రెంటాల కు చెందిన రవీంద్రారెడ్డి అనే వ్యక్తి 11 నెలల క్రితం బెంజ్ కార్ కొనుగోలు చేశాడు. అయితే ఇటీవల ఆ కారు డ్రైవర్ కారు తాళాలను పోగొట్టాడు. దాంతో రవీంద్రారెడ్డి సెకండ్ హ్యాండ్ తాళం కోసం షోరూంలో ప్రయత్నించాడు. కానీ దొరకలేదు దాంతో రవీంద్రా రెడ్డికి ఆయన స్నేహితులు కారు తగలబెడితే ఇన్సూరెన్స్ వస్తుందని సలహా ఇచ్చారు.

దాంతో ఈ నెల 18న పెదకాకాని వద్ద కు కార్ ను తరలించి పెట్రోల్ పోసి రవీంద్ర రెడ్డి స్నేహితుడు నాగరాజు నిప్పంటించాడు. అయితే ఆ సమయంలో నాగరాజు కు కూడా గాయాలయ్యాయి. ఇక ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే కారు తగలబెట్టారా లేదంటే మరేమైనా కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇక తాళం పోయినందుకు బెంజ్ కారు తగలబెట్టడం అనే వార్త చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. తాళం కోసం మరో మార్గం లేదా అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: