ఏపీ సిఎం వైఎస్ జగన్ ఇంటి సమీపంలో ఉన్న నివాసాలను భద్రతా కారణాలతో కూల్చి వేయడం ఇప్పుడు సంచలనం అయింది. తాజాగా తాడేపల్లి లోని సీఎం ఇంటి సమీపం లో ఉన్న మాజీ వాలంటీర్ శివశ్రీ ఇంటిని అధికారులు కూల్చడం వివాదాస్పదం అయింది. ఈ సాయంత్రం నోటీస్ ఇచ్చి అప్పుడే ఏ విధంగా కూల్చేస్తారు అంటూ ఆమె సోదరుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆత్మహత్యా ప్రయత్నం చేసాడు.

సాయంత్రం నోటీసు ఇచ్చిన  వెంటనే కూలుస్తూ నిర్ణయం తీసుకున్నారు. జరుగుతున్న పరిణామాలతో సొమ్మసిల్లి పడిపోయిన శివ శ్రీ తల్లి రాజ్యలక్ష్మిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ అంశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. పవన్ ను ఆమె  కలిసిన తర్వాత పోలీసులు ఆమెను టార్గెట్ చేయడం వివాదాస్పదం అయింది. రాత్రి అక్కడి ఇళ్ళను దాదాపుగా అధికారులు కూల్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: