తాగ‌డానికి సిగరెట్‌ అప్పుగా అడిగితే ఇచ్చేందుకు నిరాకరించిన పాన్‌షాపు యజమానిని దారుణంగా హత్య చేశారు. మ‌ధురైలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌లో నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మదురై జిల్లాలోని సక్కిమంగళం సమీపంలోని సమత్తువపురంలో వినోద్‌ పాన్‌షాపు నిర్వ‌హిస్తున్నారు. రాత్రి స‌మ‌యంలో ఇదే ప్రాంతానికి చెందిన అరుణ్‌పాండి, జ్యోతిమ‌ణి, కార్తీక్‌ దుకాణం ద‌గ్గ‌ర‌కు వచ్చి అప్పుగా సిగరెట్ ఇవ్వ‌మ‌ని కోరారు. డబ్బిస్తేనే సిగరెట్‌ ఇస్తానని వినోద్ స్ప‌ష్టం చేశాడు. అప్పు ఇవ్వ‌న‌ని తెగేసి చెప్ప‌డంతో వారు ఆగ్రహించి వినోద్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వినోద్‌ను మధురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండ‌గా అక్క‌డే ఆయ‌న మృతిచెందారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు ప‌రారీలో ఉన్న ముగ్గురు నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డం కోసం పోలీసులు మూడు ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. గ‌తంలో కూడా మ‌ధురై స‌మీపంలోనే ఒక టిఫిన్ సెంట‌ర్ య‌జ‌మానిపై టిఫిన్ చేయ‌డానికి అప్పు ఇవ్వ‌లేద‌నే కోపంతో దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. చిన్న చిన్న సంఘ‌ట‌న‌ల‌కే దాడులు చేసే సంస్కృతి పెరిగిపోతుండ‌టంపై సామాజిక‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag